ఏపీ రాజధానిపై స్పష్టత ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మరోసారి చర్చకకు దారి తీసింది. లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ [more]

Update: 2021-08-29 12:32 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మరోసారి చర్చకకు దారి తీసింది. లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. పెరిగిన పెట్రోలు ధరలపై రాష్ట్రాల్లో పన్నులపై కేంద్రం సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అని పేర్కొంది. ప్రధాన నగరాల్లో రాజధాని కింద విశాఖగా పేర్కొంటూ లోక్ సభ లో సమాధానమివ్వడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దీనిపై అమరావతి జేఏసీ నేతలు తప్పుపడుతున్నారు. రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉండగా విశాఖ అని ఎలా ప్రకటిస్తారంటూ నిలదీస్తున్నారు.

Tags:    

Similar News