తాడిపత్రిలో టెన్షన్ …టెన్షన్

తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపు జేసీ సోదరులు దీక్షకు దిగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాదాపు 300 మంది పోలీసులు తాడిపత్రి పట్టణంలో కవాతును నిర్వహించారు. తాడిపత్రి [more]

Update: 2021-01-03 12:26 GMT

తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపు జేసీ సోదరులు దీక్షకు దిగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాదాపు 300 మంది పోలీసులు తాడిపత్రి పట్టణంలో కవాతును నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలో సెక్షన్ 144, 30 అమల్లో ఉందని పోలీసులు అనౌన్స్ చేశారు. రేపు ఇళ్లను వదలి ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రేపు జేసీ బ్రదర్స్ దీక్ష సందర్భంగా తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News