బ్రేకింగ్ : టీడీపీ అభ్యర్థిపై వైసీపీ కార్యకర్తల దాడి

నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటర్లను అరవిందబాబు ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు ఈ దాడికి [more]

Update: 2019-04-11 03:46 GMT

నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటర్లను అరవిందబాబు ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు ఈ దాడికి దిగారు. దీంతో అరవిందబాబు ఉప్పలపాడులో రోడ్డుపైనే నిరసనకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు మొహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను చెదరగొడుతున్నారు. లాఠీఛార్జి చేశారు.

Tags:    

Similar News