ఓటమిని ఊహించలేకపోయాం

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. మొత్త 12 అంశాలపై చర్చించినట్లు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఓటమిని తాము ఊహించలేకపోయామన్నారు. ఓటమికిగల కారణాలను [more]

Update: 2019-08-09 09:13 GMT

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. మొత్త 12 అంశాలపై చర్చించినట్లు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఓటమిని తాము ఊహించలేకపోయామన్నారు. ఓటమికిగల కారణాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. జగన్ పాలన అరాచకంగా ఉందన్న అచ్చెన్నాయుడు ఏడుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. తిరిగి ప్రజలను టీడీపీవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Tags:    

Similar News