బ్రేకింగ్ : టీడీపీ సభ్యుల సస్పెన్షన్

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. చివరి రోజు రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి రాజధానిలో [more]

Update: 2019-12-17 11:49 GMT

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. చివరి రోజు రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి రాజధానిలో భూముల కొనుగోలు చేసిన వారి పేర్లను చదువుతున్నారు. దీనికి అభ్యంతరం తెలుపుతూ టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. వియ్ వాంట్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. దీంతో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, మద్దాలి రాజా, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయులు, వై సాంబశివరావులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు వారు నినాదాలు చేస్తుండగా మార్షల్స్ సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.

Tags:    

Similar News