పల్నాడులో టెన్షన్ టెన్షన్

తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన చలో ఆత్మకూరు కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా తెలుగుదేశం పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ముఖ్య [more]

Update: 2019-09-11 02:21 GMT

తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన చలో ఆత్మకూరు కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా తెలుగుదేశం పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ముఖ్య నేతలందరినీ ఇప్పటికే గృహ నిర్భంధంలో ఉంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కూడా పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. చంద్రబాబు నివాసంలోకి టీడీపీ నేతలను ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. ఆత్మకూరులో చంద్రబాబు ప్రసంగించేందుకు ఉంచిన ప్రచార రథాన్ని కూడా పోలీసులు వెనక్కు తీసుకు వచ్చారు. దీంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. న్యాయం అడిగితే అరెస్ట్ లు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నారాలోకేష్ ను కూడా బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News