రేపటి నుంచి అభ్యర్థుల ఎంపిక

గతానికి భిన్నంగా ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ పోలిట్ [more]

Update: 2019-02-16 10:42 GMT

గతానికి భిన్నంగా ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టును ప్రకటించాలని నిర్ణయించారు. విభేదాలు, వివాదాలు లేని 100 నుంచి 120 స్థానాల్లో అభ్యర్థులను ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించనున్నారు. రేపటి నుంచే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక, ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో కమిటి, స్ట్రాటజీ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News