టీడీపీకి వచ్చిన ఓట్లు ఎన్నంటే?

హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమయింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి కేవలం 1513 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి పోటీ [more]

Update: 2019-10-24 09:41 GMT

హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమయింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి కేవలం 1513 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి పోటీ చేశారు. హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీకి బలంగా మద్దతిచ్చే సామాజిక వర్గం ఓట్లు దాదాపు ఎనిమిదివేలకు పైగానే ఉన్నాయి. అయితే ఆ సామాజిక వర్గం కూడా టీడీపీకి అండగా నిలబడలేదు. ఈ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందకు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నల్లగొండ జిల్లా నేతలందరూ కలసి పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు వద్ద పట్టుబట్టారు. నేతల ఉత్సాహం చూసి చంద్రబాబు కూడా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫలితాలను చూసిన తర్వాత టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి.

Tags:    

Similar News