ఆ ఇద్దరు నేతలు వైసీపీలోకే..!

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే ఇద్దరు టీడీపీ [more]

Update: 2019-03-12 12:39 GMT

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైసీపీలో చేరగా రేపు మరో ఎంపీ, ఎమ్మెల్సీ వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రేపు వైసీపీలో చేరనున్నారు. టీడీపీ తరపున ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయాలని ఆయనకు చంద్రబాబు ఆఫర్ ఇచ్చినా ఆయన మొగ్గు చూపలేదు. ఆయన వైసీపీ నుంచి ఇదే స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News