వైఎస్ కంటిన్యూ… జగన్ కటింగ్

తాను తెచ్చిన రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మాత్రం అమరావతి నగర నిర్మాణాన్ని పక్కన పెట్టారని [more]

Update: 2019-07-22 08:27 GMT

తాను తెచ్చిన రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మాత్రం అమరావతి నగర నిర్మాణాన్ని పక్కన పెట్టారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ బ్యాంకు రుణాన్ని చంద్రబాబునాయుడు పాలనలోని అవినీతి వల్లనే తిరస్కరించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆరోపించారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ వైసీపీ నేతల ఫిర్యాదుల వల్లనే ప్రపంచబ్యాంకు రుణాన్ని తిరస్కరించిందన్నారు. తనపైన ఉన్న కోపంతో రాజధాని నిర్మాణం ఆపొద్దని ఆయన జగన్ ను కోరారు.

Tags:    

Similar News