స్పీకర్ కు హైకోర్టు మళ్ళీ నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పార్టీ ఫిరాయించిన 12 మంది [more]

Update: 2019-06-12 06:00 GMT

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వారు తమ పిటిషన్ లో కోరారు. విచారణను నాలుగు వారాల పాటు వాయిదావేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా హైకోర్టు నోటీసు జారీ చేసింది. నిన్న కాంగ్రెస్ నేతల పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు నేడు నోటీసులు జారీ చేయడం విశేషం.

Tags:    

Similar News