బ్రేకింగ్ : టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ...??

Update: 2018-12-02 12:49 GMT

ఖమ్మం జిల్లా ముదిగొండలో డబ్బుల కలకలం రేపింది. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పోలీసు స్టేసన్ ఎదుట భైఠాయించారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ భట్టి తన కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. ఆధార్, బ్యాంకు అకౌంట్లు సేకరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Similar News