బ్రేకింగ్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు బహిష్కరించడంతో కాంగ్రెస్ అభ్యర్థి మినహా పోటీలో ఉన్న మిగతా ఐదుగురు అభ్యర్థులు [more]

Update: 2019-03-12 12:28 GMT

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు బహిష్కరించడంతో కాంగ్రెస్ అభ్యర్థి మినహా పోటీలో ఉన్న మిగతా ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి శేరి సుభాష్ రెడ్డి, యొగ్గె మల్లేషం, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంఐఎం నుంచి రియాజ్ గెలుపొందారు. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ తో పాటు టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.

Tags:    

Similar News