సెకండ్ వేవ్… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో తిరిగి క్వారంటైన్ సెంటర్లను తెరవాలని నిర్ణయించింది. గతంలో ఉన్న క్వారంటైన్ సెంటర్లను [more]

Update: 2021-04-04 01:46 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో తిరిగి క్వారంటైన్ సెంటర్లను తెరవాలని నిర్ణయించింది. గతంలో ఉన్న క్వారంటైన్ సెంటర్లను కరోనా తగ్గిన కారణంగా మూసివేసింది. అయితే గత కొద్దిరోజులుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీతో రాష్ట్రంలోని అన్ని క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ధరించడమే కరోనా నియంత్రణకు మార్గమని ప్రభుత్వం పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది.

Tags:    

Similar News