ఓటరు జాబితా లేకుండానే ఎన్నికలేంటి..?

ఓటరు జాబితా కూడా లేకుండానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షులు [more]

Update: 2019-05-09 11:46 GMT

ఓటరు జాబితా కూడా లేకుండానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల సభ్యుల పదవీకాలం ముగుస్తుందని, మళ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నందు కొత్త సభ్యులు వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని, కొత్త సభ్యులనే ఓటర్లుగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని అత్యవసరం విషయంగా పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికలను నిలిపివేయాలని కోరారు.

Tags:    

Similar News