తెలంగాణ మంత్రివర్గంలో కొత్త ముఖాలు

తెలంగాణలో రేపు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. ఇందుకోసం రాజ్ భవన్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతగా 10 మందిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. [more]

Update: 2019-02-18 14:09 GMT

తెలంగాణలో రేపు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. ఇందుకోసం రాజ్ భవన్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతగా 10 మందిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో పార్టీలో ముఖ్యులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ లకు స్థానం ఇవ్వడం లేదని తెలుస్తోంది. వీరిని పార్లమెంటు ఎన్నికల తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని సమాచారం. ఇక, ఐదుగురు కొత్తవారికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది.

మంత్రివర్గంలోకి వీరే..?

ఇంద్రకరణ్ రెడ్డి(నిర్మల్)
జగదీశ్ రెడ్డి(సూర్యాపేట)
నిరంజన్ రెడ్డి(వనపర్తి)
వేముల ప్రశాంత్ రెడ్డి(బాల్కొండ)
చామకూర మల్లారెడ్డి(మేడ్చల్)
కొప్పుల ఈశ్వర్(ధర్మపురి)
ఎర్రబెల్లి దయాకర్ రావు(పాలకుర్తి)
శ్రీనివాస్ గౌడ్(మహబూబ్ నగర్)
తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్ నగర్)

Tags:    

Similar News