నరేంద్ర మోడీపై మాజీ జవాన్ తేజ్ బహదుర్ పోటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నామినేషన్ల చివరి [more]

Update: 2019-04-29 10:25 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నామినేషన్ల చివరి రోజైన ఇవాళ ఆ పార్టీ అభ్యర్థిని మార్చింది. నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా మాజీ జవాన్ తేజ్ బహదుర్ యాదవ్ ను పోటీకి నిలిపింది. తేజ్ బహదుర్ జవాన్లకు ప్రభుత్వం నాణ్యత లేని ఆహారాన్ని పెడుతోందని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో బాగా వైరల్ కావడంతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకొచ్చింది. దీంతో ఆయనను విధుల్లో నుంచి తప్పించారు. ఇప్పుడు ఏకంగా సమాజ్ వాదీ పార్టీ ఆయనను ప్రధానిపైనే పోటీకి నిలుపుతోంది. ఇంతకుముందు ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థి షాలినీ యాదవ్ ను ప్రకటించింది సమాజ్ వాదీ పార్టీ.

Tags:    

Similar News