వేధిస్తున్న యువకుడిని కిడ్నాప్ చేసిన యువతి

తనను వేధిస్తున్న యువకుడికి తానే బుద్ధిచెప్పాలనుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఏకంగా పోకిరీ యువకుడిని కిడ్నాప్ చేసి దాడికి దిగింది. మల్కాజిగిరిలో [more]

Update: 2019-01-31 13:51 GMT

తనను వేధిస్తున్న యువకుడికి తానే బుద్ధిచెప్పాలనుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఏకంగా పోకిరీ యువకుడిని కిడ్నాప్ చేసి దాడికి దిగింది. మల్కాజిగిరిలో ఉంటూ ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న యువతిని ఎస్ఆర్ నగర్ కు చెందిన కార్పెంటర్ పని చేసే సాయి అనే యువకుడు గత కొంతకాలంగా ఫోన్ లో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో సదరు యువకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న యువతి తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ కి స్కెచ్ వేసింది. మాయమాటలతో సదరు యువకుడిని సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ ప్రాంతానికి రప్పంచింది. అక్కడ అందరూ చూస్తుండగానే యువకుడిని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లింది. ఆమెతో పాటు ఐదుగురు స్నేహితులు యువకుడిని చితకబాదారు. అయితే, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు వారిని చేదించి పట్టుకున్నారు. అప్పటికే ఆ యువకుడు గాయాలపాలయ్యాడు. యువకుడిని ఆసుపత్రికి తరలించి, కిడ్నాప్ చేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న యువతి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News