నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా తెలుగుదేశం పార్టీ వ్యక్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద కైమా కైమా చేశేవారమని, సీఐఎస్ఎఫ్ కంట్రోల్ లో ఉన్న ఎయిర్ పోర్టులో చేయాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ 3000 కిలోమీటర్లు నడిచారని, అప్పుడు ఆయన భద్రత బ్రహ్మాండంగా ఉందని, ఘటన ఎయిర్ పోర్టులో జరిగినందున రాష్ట్ర ప్రభత్వ వైఫల్యం లేదని ఆయన స్పష్టం చేశారు.