వైఎస్సార్ కాంగ్రెస్ కు టీడీపీ ఎంపీ అభినందనలు

Update: 2018-10-16 08:49 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. దీంతో తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ. 1 కోటి సహాయాన్ని ప్రకటించింది. దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ కఠిన సమయంలో పార్టీలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మరికొంతమంది ప్రముఖులను, సామాన్యులను సైతం రామ్మోహన్ నాయులు ట్విట్టర్ ద్వారా అభినందిస్తున్నారు.

 

Similar News