బాబు మీటింగ్ కు డుమ్మా

తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నటీడీపీ  సమావేశానికి కొందరు టీడీపీ ముఖ్య నాయకులు డుమ్మాకొట్టారు. గురువారం చంద్రబాబునాయుడు పార్టీ విస్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ,రాజమండ్రి [more]

Update: 2019-09-05 13:53 GMT

తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నటీడీపీ సమావేశానికి కొందరు టీడీపీ ముఖ్య నాయకులు డుమ్మాకొట్టారు. గురువారం చంద్రబాబునాయుడు పార్టీ విస్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ,రాజమండ్రి లోకసభ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు డుమ్మా కొట్టారు. వీరు టీడీపీని వీడుతారనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది. కొంతకాలంగా వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చలమలశెట్టి సునీల్, మాగంటి రూపలు మాత్రం వ్యాపారాల్లో బిజీగాఉన్నందున రాలేదని టీడీపీ నేతలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. తోట త్రిమూర్తులు మాత్రం కావాలనే సమావేశానికి రాలేదని తెలుస్తోంది.

Tags:    

Similar News