సీఎం నివాసం ముందే కొట్టుకున్న టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు లొల్లి ముఖ్యమంత్రి నివాసం వద్దకు చేరింది. గుంటూరు జిల్లా మాచర్ల టిక్కెట్ దక్కని చలమారెడ్డి అనే నాయకుడిని ఎంపీ రాయపాటి సాంభశివరావు, సీనియర్ [more]

Update: 2019-03-20 12:44 GMT

తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు లొల్లి ముఖ్యమంత్రి నివాసం వద్దకు చేరింది. గుంటూరు జిల్లా మాచర్ల టిక్కెట్ దక్కని చలమారెడ్డి అనే నాయకుడిని ఎంపీ రాయపాటి సాంభశివరావు, సీనియర్ నేత లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి తీసుకువచ్చారు. టిక్కెట్ ఇవ్వలేకపోయిన భవిష్యత్ లో ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు చలమారెడ్డిని బుజ్జగించి వెళ్లారు. చంద్రబాబు వెళ్లగానే చలమారెడ్డి ఆగ్రహంతో లక్ష్మారెడ్డి అనే నేతపై చేయిచేసుకున్నారు. తనకు టిక్కెట్ రాకపోవడానికి, అంజిరెడ్డికి టిక్కెట్ రావడానికి కారణం లక్ష్మారెడ్డినే అని ఆరోపిస్తూ చల్మారెడ్డి ఆయనను దూషిస్తూ చేయిసుకున్నారు. ఇక, చలమారెడ్డి వర్గీయులు ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేశారు. గుంటూరులోనూ రాయపాటి సాంభశివరావు ఇంటి వద్ద చలమారెడ్డి అనుచరులు ఆందోళన చేసే అవకాశం ఉండటంతో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News