జమ్మలమడుగు నేత వైసీపీలోకి జంప్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న రామసుబ్బారెడ్డి ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలుకు [more]

Update: 2020-03-09 06:47 GMT

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న రామసుబ్బారెడ్డి ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలుకు దూరంగా ఉంటున్నారు. తన ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకుని చంద్రబాబు మంత్రి వర్గంలో చేర్చుకున్నప్పటి నుంచి ఆయన పార్టీలో ఇబ్బందిగానే ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ భారీ మెజారిటీతో ఓటమి పాలయ్యారు. కొన్ని నెలల క్రితం అమెరికాలోనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కూడా రామసుబ్బారెడ్డి రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లోనే రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పేసుకున్నారు.

Tags:    

Similar News