చిత్తూరులో పోటా పోటీ.. హౌస్ అరెస్ట్ లు

కుప్పం నియోజకవర్గంలో హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. దీనికి పోటీగా వైసీపీ కూడా ఆందోళనకు దిగింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా [more]

Update: 2020-10-26 05:03 GMT

కుప్పం నియోజకవర్గంలో హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. దీనికి పోటీగా వైసీపీ కూడా ఆందోళనకు దిగింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. దీంతో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేశారు. మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ బైక్ ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు ఇవ్వాలంటూ నాలురోజుల పాటు పాదయాత్ర చేయాలని టీడీపీ సిద్ధమైంది. పోలీసులు అడ్డుకోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ప్రతిపక్షాలు నిరసన తెలియజేసే హక్కు లేదా? అని చంద్రబబు ప్రశ్నించారు.

Tags:    

Similar News