టీడీపీ విప్ జారీ.. ఆ ముగ్గురి కోసమే

తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులకు విప్ జారీ చేసింది. ఈరోజు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు రానుండటంతో శాసనమండలి సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని [more]

Update: 2020-06-17 04:13 GMT

తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులకు విప్ జారీ చేసింది. ఈరోజు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు రానుండటంతో శాసనమండలి సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని విప్ లో పేర్కొన్నారు. ఈరోజు ఈ బిల్లులపై ఓటింగ్ జరిగే అవకాశముండటంతో టీడీపీ విప్ జారీ చేసింది. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ్ రెడ్డి, శమంతకమణి నిన్న శాసనమండలికి హాజరుకాలేదు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ మండలి ఛైర్మన్ ను కోరింది. ఈరోజు మండలికి ఈ ముగ్గురు రాకుంటే విప్ థిక్కరించినట్లే అవుతుంది.

Tags:    

Similar News