జగన్ పై బాబు రోజుకొక వీడియో

ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాల్లోనే తాము నిరసన తెలపాల్సి వచ్చిందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సభలో వైసీపీ సభ్యులు హుందాతనాన్ని పాటించడం లేదన్నారు. ఈరోజు [more]

Update: 2019-07-25 12:59 GMT

ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాల్లోనే తాము నిరసన తెలపాల్సి వచ్చిందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సభలో వైసీపీ సభ్యులు హుందాతనాన్ని పాటించడం లేదన్నారు. ఈరోజు కూడా తమ సభ్యులను సస్పెండ్ చేసే పరిస్థితికి దిగజారారన్నారు. సభలో వారు ఏం చేస్తారో చెప్పకుండా, ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులపైనే ఎక్కువగా చర్చ జరుగుతుందన్నారు. తన అనుభవంతో గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతో జాగ్రత్తగా ఉండాలని చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా గతంలోనూ, ఇప్పుడూ జగన్ కేసీఆర్ పైనా, గోదావరి జలాలపైన చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. జగన్ ఎన్నికల సమయంలో కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని భావితరాల భవిష్యత్తును తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News