కాస్కో…నా బాబూ అంటున్న ఎస్పీవై రెడ్డి

తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కోసం ఆశావహులు నామినేషన్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా టిక్కెట్లు దక్కని నేతలు నామినేషన్లు వేయడం ద్వారా తాము పోటీలో ఉంటున్నామని అధినేతకు [more]

Update: 2019-03-18 07:17 GMT

తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కోసం ఆశావహులు నామినేషన్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా టిక్కెట్లు దక్కని నేతలు నామినేషన్లు వేయడం ద్వారా తాము పోటీలో ఉంటున్నామని అధినేతకు సంకేతాలు పంపిస్తున్నారు. నంద్యాల ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కూడా ఇవాళ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరికీ ఇంకా టిక్కెట్లు ఖరారు కాలేదు. టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పోటీలో ఉంటామని అధినేతకు సంకేతాలు ఇచ్చేందుకు వారిద్దరు నామినేషన్లు వేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News