చూద్దాం సీబీఐ ఏం చెబుతుందో?

న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై సీబీఐ ఏం చెబుతుందో చూద్దామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి వ్యవస్థ మరొక వ్యవస్థను గౌరవించాల్సిందేనన్నారు. ఇక రాజధాని అమరావతి కోసం [more]

Update: 2020-10-13 08:39 GMT

న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై సీబీఐ ఏం చెబుతుందో చూద్దామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి వ్యవస్థ మరొక వ్యవస్థను గౌరవించాల్సిందేనన్నారు. ఇక రాజధాని అమరావతి కోసం టీడీపీ నేతలు రాజీనామా చేసి వెళితే ప్రజలే తీర్పు చెబుతారన్నారు. ఉత్తరాంధ్ర వాసులుగా తాము విశాఖకు రాజధాని కావాలని అంటున్నామని, టీడీపీ నేతలు అమరావతిలోనే ఉండాలంటున్నారని, అయితే ఎవరి నిర్ణయం సరైనదేనన్నది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. అధికార వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి కూడా జరుగుతుందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News