చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ గ్యారెంటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ మాత్రమే కాదు ఏపీ ప్రజలే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. [more]

Update: 2019-01-14 11:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ మాత్రమే కాదు ఏపీ ప్రజలే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు కేవలం ప్రచారానికి పరిమితమయ్యే నాయకుడని, ప్రజల సొమ్ముతో ప్రచారాం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలకు ఆధ్యుడు చంద్రబాబేనని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Tags:    

Similar News