చంద్రబాబు మూడుసార్లు మోసం చేశారు

చంద్రబాబు నాయుడు తమను మూడుసార్లు మోసం చేశారని, తెలుగుదేశం పార్టీలో తనలాంటి బాధితుడు మరొకరు లేరని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వాపోయారు. కర్నూలు టిక్కెట్ [more]

Update: 2019-03-21 07:50 GMT

చంద్రబాబు నాయుడు తమను మూడుసార్లు మోసం చేశారని, తెలుగుదేశం పార్టీలో తనలాంటి బాధితుడు మరొకరు లేరని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వాపోయారు. కర్నూలు టిక్కెట్ తనకు కాకుండా టీజీ భరత్ కు ఇవ్వడం పట్ల అలక వహించిన ఆయన గురువారం ఆయన కర్నూలులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. తన తండ్రిని గతంలో మంత్రివర్గం నుంచి తొలగించి చంద్రబాబు మొదటిసారి మోసం చేశారని, 2009లో తనకు టిక్కెట్ ఇవ్వకుండా చంద్రబాబు రెండోసారి మోసం చేశారని ఆరోపించారు. అయినా కూడా చంద్రబాబును నమ్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలో చేరి మరోసారి మోసపోయానని పేర్కొన్నారు. ఆయన భవిషత్య్ కార్యాచరణపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News