బ్రేకింగ్ : ఈబీసీ రిజర్వేషన్లపై సుప్రీం కీలక నిర్ణయం

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాలపై కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో ఈ [more]

Update: 2019-01-25 06:12 GMT

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాలపై కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో ఈ అంశంపై నివేదికను అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈబీసీలకు రిజర్వేషన్లు రాజ్యంగ విరుద్ధమని, వాటిని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారించిన కోర్టు ఈబీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మూడు వారాల్లో కేంద్రం నివేదిక ఇచ్చాక సుప్రీం తదుపరి విచారణ జరపనుంది.

Tags:    

Similar News