ఘోస్ట్ సిటీలా మార్చేశారు

అమరావతిని ఘోస్ట్ సిటీలా మార్చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. సుజనా చౌదరి జగన్ వంద రోజుల పాలనపై స్పందించారు. వరద నియంత్రణలో ప్రభుత్వం [more]

Update: 2019-09-07 14:02 GMT

అమరావతిని ఘోస్ట్ సిటీలా మార్చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. సుజనా చౌదరి జగన్ వంద రోజుల పాలనపై స్పందించారు. వరద నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిలయిందని, ముంపు గ్రామాలు కాని ఊళ్లుకూడా మునిగిపోయాయన్నారు. పోలవరం ప్రాజెక్టును నిలిపేశారన్నారు. అన్న క్యాంటిన్ల పేరు మారిస్తే బాగుండేదని సుజనా అభిప్రాయపడ్డారు. అమరావతిలో అవినీతిని ఎందుకు నిరూపించలేకపోయారని సుజనాచౌదరి ప్రశ్నించారు. వంద రోజుల్లో జరిగిన భూ కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని నిలదీశారు.

Tags:    

Similar News