అందుకే వారు రావడం లేదు

రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదా అయింది ఏమీ లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా [more]

Update: 2019-09-25 10:14 GMT

రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదా అయింది ఏమీ లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు. ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ను ఉత్తరాదిలో ఉన్న మరో రాష్ట్రంగా మార్చారన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందన్నారు సుజనా చౌదరి. రివర్స్ ఆలోచనలు మాని వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సుజనా చౌదరి సూచించారు.

Tags:    

Similar News