పేరుకు తగ్గట్టే ఆమె మనస్సు కూడా..!

Update: 2018-08-23 07:52 GMT

సుధామూర్తి... ఇన్ఫోసిస్ సభ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి. రచయిత్రి. వేల కోట్ల ఆస్తి కలిగిన కుటుంబమైనా ఆమె అంతకన్నా గొప్ప మానవతామూర్తి. తాజాగా, కేరళ, కొడగు వరదల నేపథ్యంలో ఆమె మానవతా దృక్పధం మరోసారి వెల్లడైంది. వరద బాధితుల కోసం ఇన్ఫోసిస్ సంస్థ పెద్దఎత్తున దుస్తులు, నిత్యావసర వస్తువులను అందజేస్తోంది. ఈ వస్తువులను సంస్థ సిబ్బందితో పాటు సుధామూర్తి కూడా ప్యాకింగ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా కేంద్ర మంత్రి సదానంద గౌడ సుధామూర్తిని ‘అమ్మ’గా సంభోదిస్తూ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. వరద బాధితులకు ఎంతోమంది వ్యాపారవేత్తలు విరాళం, ఇతర సహాయం చేస్తూ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. కానీ, సుధామూర్తి స్వయంగా వరద బాధితులకు వస్తువులు సర్ధిపంపి అందరిలోనూ గొప్పగా నిలిచారు.

 

Similar News