రాహుల్, చంద్రబాబుకు షాక్ ఇచ్చిన స్టాలిన్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే 23న ఎన్డీయేతర పక్షాల భేటీ నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు డీఎంకే చీఫ్ స్టాలిన్ షాక్ ఇచ్చారు. 23వ [more]

Update: 2019-05-20 08:42 GMT

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే 23న ఎన్డీయేతర పక్షాల భేటీ నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు డీఎంకే చీఫ్ స్టాలిన్ షాక్ ఇచ్చారు. 23వ తేదీన ఎటువంటి సమావేశం ఉండదని, ఆ రోజు సమావేశం కూడా అవసరం లేదని ఆయన తెలిపారు. ఫలితాల రోజే అన్ని విపక్షాలతో సమావేశం నిర్వహించడం ద్వారా ఎవరికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టేందుకు ప్రయత్నించాలని రాహుల్ గాంధీ, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు అందరు నేతలను కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సమావేశం అవసరం లేదని స్టాలిన్ చెప్పడం వీరిద్దరికి మింగుడుపడని వ్యవహారం. ఇక, మాయావతి కూడా ఇవాళ ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలుస్తారని ప్రచారం జరిగినా ఆమె వెళ్లడం లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News