ఎన్ఐఏ కస్టడీలోకి శ్రీనివాసరావు

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఏఐ కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఎన్ఐఏ విచారణను [more]

Update: 2019-01-12 06:53 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఏఐ కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. వారం పాటు శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి ఇస్తూ నిన్న కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇవాళ విజయవాడలో వైద్య పరీక్షలు చేయించి ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. అయితే, విచారణ కోసం నిందితుడిని హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకురావాలని ఎన్ఐఏ నిర్ణయించింది.

Tags:    

Similar News