తెలంగాణకు మళ్లీ అంటుకున్నట్లేనా?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్కరోజే [more]

Update: 2020-05-12 03:29 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివి కావడమే గమనార్హం. దాదాపు నలభై రోజుల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత నెల 3వ తేదీన 75 కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1275కు చేరుకుంది. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ తెలంగాణలో 30 మంది మృతి చెందారు.

Tags:    

Similar News