బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. ఒక్కరోజులోనే ఎనిమిది వేలకు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులో 7,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 63 మంది మృతి చెందారు. దీంతో [more]

Update: 2020-08-03 13:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులో 7,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 63 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,586కు చేుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 1,537 మంది మృతి చెందారు. అత్యధికంగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో 1,113 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 76,377 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 88,672కు చేరుకుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News