భారత్ లో ఏమాత్రం తగ్గని కరోనా

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 24,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 312 మంది కరోనాతో మరణించారు.. దీంతో [more]

Update: 2020-12-24 05:57 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 24,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 312 మంది కరోనాతో మరణించారు.. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,23,778 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,46,756 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,83,849 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 96,93,173 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News