బ్రేకింగ్ : భారత్ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు…. 33 లక్షలు దాటేసి

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 75,760 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,023 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ప్రస్తుతం [more]

Update: 2020-08-27 03:59 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 75,760 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,023 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,10,234 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 60,472 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 7.25 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 25.23 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News