బ్రేకింగ్ : భారత్ లో 17 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా 54,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 17లక్షలు [more]

Update: 2020-08-02 04:30 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా 54,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 17లక్షలు దాటాయి. ఇప్పటి వరకూ భారత్ కరోనా బారిన పడిన వారి సంఖ్య 17,50,724 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 37,364 మంది మరణించారు. భారత్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5.67 లక్షలున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 11.45 లక్షలకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News