ఏపీలో నిలకడగా కొనసాగుతున్న కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 3,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 22 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-10-24 12:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 3,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 22 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,04,026 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 6,566 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 31,469 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 7,65,991మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News