లోక్‌స‌భ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

Update: 2018-07-20 08:24 GMT

పార్ల‌మెంటు స‌మావేశాల్లో శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ఎదురుప‌డ్డారు. త‌ల్లీ... రాష్ట్రాన్ని విభ‌జించి రెడ్ల‌కు తీర‌ని అన్యాయాన్ని చేశారు. కాంగ్రెస్ ను న‌మ్ముకున్నందుకు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు అని చెప్పి సోనియా గాంధీకి జేసీ దివాక‌ర్ రెడ్డి దండం పెట్టారు. దీంతో సోనియా గాంధీ న‌వ్వుతూ ముందుకెళ్లారు.

 

Similar News