వారికి ఆ యోగ్యత లేదు

యోగ్యతలేని వారు హోదాపై మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాడు అమిత్ షా పై రాళ్లదాడి చేయించారని, [more]

Update: 2021-04-14 01:14 GMT

యోగ్యతలేని వారు హోదాపై మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాడు అమిత్ షా పై రాళ్లదాడి చేయించారని, ఇప్పుడు కేంద్ర బలగాలు కావాలని కోరుతున్నారని సోము వీర్రాజు మండి పడ్డారు. ఐదేళ్లు చంద్రబాబు రాజధానిని కట్టకుండా 7,200 కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలో బీజేపీ విజయం ఖాయమయిందని సోము వీర్రాజు అన్నారు.

Tags:    

Similar News