ఏ ప్రకటన లేకుండా స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఎందుకు?

ఆలయాలపై దాడుల విషయంలో బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అందుకోసమే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తెరమీదకు తెచ్చారన్నారు. విశాఖ స్టీల్ [more]

Update: 2021-02-19 07:25 GMT

ఆలయాలపై దాడుల విషయంలో బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అందుకోసమే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తెరమీదకు తెచ్చారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను తాము రక్షిస్తామని సోము వీర్రాజు చెప్పారు. ఇదే బీజేపీ స్పష్టమైన వైఖరి అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తామని కేంద్ర మంత్రి ఒక్కరైనా ప్రకటన చేశారా? నోటిఫికేషన్ విడుదల చేశారా? అని ప్రశ్నించారు. మరి ఎలా ఉద్యమం చేస్తారని ఆయన నిలదీశారు. 2024 ఎన్నికలలో బీజేపీని నిలువరించేందుకు వైసీపీ, టీడీపీ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకున్నాయన్నారు.

Tags:    

Similar News