ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

ఏపీ రాజకీయాల్లో బీజేపీ అవసరం ఉందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జనసేన, బీజేపీలు కలసి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోము [more]

Update: 2020-08-11 05:19 GMT

ఏపీ రాజకీయాల్లో బీజేపీ అవసరం ఉందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జనసేన, బీజేపీలు కలసి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ పార్టీలని చెప్పారు. నిజమైన అభివృద్ధి ఏపీకి అవసరమని చెప్పారు. అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రామ్ మాధవ్, పురంద్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News