అంబులెన్స్ ల్లోనే ప్రాణాలు పోతున్నా?

అంబులెన్స్ లలోనే అనేక మంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని చెబుతున్నా [more]

Update: 2021-04-27 01:03 GMT

అంబులెన్స్ లలోనే అనేక మంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. అందుకే ఆక్సిజన్ కూడా అందక రోగులు మరణించాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం కన్పిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం విచారకరమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News