ఆంధ్రజ్యోతిలో ఉద్యోగాలు తొలగిస్తున్నారంటూ?

ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి తమను అన్యాయంగా తొలగిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కొందరు ఉద్యోగులు ట్వీట్ చేశారు. కరోనా సాకు చూపి తమను ఉద్యోగాల నుంచి [more]

Update: 2020-04-15 14:01 GMT

ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి తమను అన్యాయంగా తొలగిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కొందరు ఉద్యోగులు ట్వీట్ చేశారు. కరోనా సాకు చూపి తమను ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారని వారు ట్వీట్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, కొందరు ఉద్యోగుల వేతనాల్లో 20 శాతం కోత విధించారని కూడా కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే దీనిపై కేటీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Tags:    

Similar News