వైసీపీలో చేరిన కీలక నేత

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ [more]

Update: 2019-03-16 13:44 GMT

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ… తమ కుటుంబానికి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే జగన్ తోనే సాధ్యమన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంటు నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనకు ఇదే స్థానం నుంచి టీడీపీ టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు పలుమార్లు ఆఫర్ చేసినా ఆయన వద్దనుకొని ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News