జగన్ పై దుష్ప్రచారం చేస్తే అభాసుపాలు కాక తప్పదు

జగన్ పై ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారని, కానీ అవేమీ ప్రజల్లో నిలవవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుట్రపూరితంగానే ఈ రకమైన దాడులు చేస్తున్నారన్నారు. [more]

Update: 2020-09-24 08:04 GMT

జగన్ పై ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారని, కానీ అవేమీ ప్రజల్లో నిలవవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుట్రపూరితంగానే ఈ రకమైన దాడులు చేస్తున్నారన్నారు. జగన్ తిరుమలలో ఉన్న సమయంలో ఎంతో భక్తిభావంతో కన్పించారని, భక్తి శ్రద్థలతో స్వామి వారి సేవలలో పాల్గొన్నారన్నారు. ఇది ఆయనను చూసిన వారందరూ అంగీకరిస్తున్న మాట అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హిందూ దేవాలయాలపై దాడి వెనక ప్రధాన ప్రతిపక్షం ఉందన్నారు. అయితే జగన్ పై ఎన్ని కుట్రలు చేసినా చివరకు అభాసుపాలు కాక తప్పదని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News